పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
Sankhavaram
2021-09-02 15:08:23

ప్రభుత్వం గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యసహాయకులు సూర్యకుమారి అన్నారు. గురువారం  శంఖవరం-6 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా కేంద్రం పరిధిలోని తల్లులకు, పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహనకల్పించడానికి మాసోత్సవాలు నిర్వహించడ వలన మంచిఫలితాలు వస్తాయన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు ఐసిడిఎస్ కేంద్రం నుంచి అందించే విలువైన సూచనలు సలహాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త నూకరత్నం, ఆశ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు పాల్గొన్నారు.
సిఫార్సు