శంఖవరంలో సాయినాధునికి బంగారు బొట్టు..


Ens Balu
4
Sankhavaram
2021-09-02 15:58:20

శంఖవరంలో శ్రీవాణి నవ దుర్గా ఆలయానికి ఎదురుగా వున్న షిర్డీసాయినాధుడికి గౌరంపేట గ్రామానికి చెందిన గుండ్రాజు సతీష్, వాసు దంపతులు బంగారు బొట్టును కానుకగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఆలయంలో వారే స్వయంగా సాయి విగ్రహానికి అతికించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, బాబావారికి తాము బంగారు బొట్టు చేయిస్తామని అనుకున్నామని, ఏకాదశి సందర్భంగా ఈరోజు దీనిని తీసుకొచ్చి బహూకరించినట్టు వారు తెలియజేశారు. అంతకుముందు బాబావారికి ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు వాటిని పంపిణీ చేశారు. గురువారం కావడంలో అత్యధిక సంఖ్యలో బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అంకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు