ఫ్రైడే డ్రైడే ప్రతీ వారం తప్పనిసరి..


Ens Balu
3
Sankhavaram
2021-09-03 09:46:41

వారానికి ఒక రోజు నీటి కుండీలు ఆరబెట్టే కార్యక్రమం తప్పక చేపట్టాలని సచివాలయ కార్యదర్శి శంకరాచార్యులు సూచించారు. శుక్రవారం శంఖవరం గ్రామసచివాలయం-2 పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ, జ్వరాలు అధికంగా వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, మంచినీటి కుండీలపై మూలు వేసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరాల లక్షణాలు కనిపిస్తే తక్షణమే గ్రామవాలంటీర్ల ద్వారా సమాచారాన్ని ఆరోగ్య సహాయకులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.

సిఫార్సు