శంఖవరంలో 2190 మందికి కోవిడ్ వేక్సిన్..


Ens Balu
2
Sankhavaram
2021-09-12 13:32:07

శంఖవరం మండలంలో 2190 మందికి కోవిడ్ వేక్సిన్ వేసినట్టుఎంపీడీఓ జె.రాంబాబు ఒక ప్రకటనలో  తెలిజేశారు. ఆదివారం శంఖవరం మంలంలో ఆయన మీడియాకి ఈ మేరకు వివరాలను విడుదల చేశారు. మండంలోని అన్ని గ్రామ, సచివాలయాలు, సబ్ సెంటర్ల పరిధిలో ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. సాయంత్రం ఆరు గంటలకే పూర్తిస్థాయిలో వేక్సిన్ల టార్గెట్ పూర్తిచేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాల్లోనూ ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసి కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సిఫార్సు