శంఖవంరంలో 300 మందికి కోవిడ్ టీకా..


Ens Balu
4
Sankhavaram
2021-09-13 11:44:38

శంఖవరం మండలం కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాల పరిధిలో 300 మందికి కోవడ్ టీకాలు వేసినట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం ఈ మేరకు పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక కోవిడ్ డ్రైవ్ లో వేయాల్సిన టీకాల్లో మిగిలిన పోయిన వాటిని ఈరోజు పూర్తిచేసినట్టు చెప్పారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ రెండు రకాల టీకాలను ప్రజలకు అందించామన్నారు. రెండవ డోసుకి కోవీషీల్డ్ టీకాలను వేసినట్టు చెప్పిన ఆయన మొదటి టీకాకకు కోవాగ్జిన్ ప్రాధాన్యత ఇచ్చినట్టు వైద్యాధికారి వివరించారు. 

సిఫార్సు