రేపు శంఖవరం మండలంలో ఎమ్మెల్యే పర్యటన..


Ens Balu
3
Sankhavaram
2021-09-14 10:03:37

శంఖవరం మండలంలో బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పర్యటించి నాడు-నేడు కింద అభివ్రుద్ధి చేసిన  పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని ఎంఈఓ ఎస్వీ రమణ చెప్పారు. మంగళవారం శంఖవరంలో ఈ మేరకు ఎంఈఓ మీడియాకి ఎమ్మెల్యే పర్యటన వివరాలు తెలియజేశారు. మండలంలో ఎంపీపీ స్కూలు జి.కొత్తపల్లి, అచ్చంపేట, టి.అగ్రహారం(నెలిపూడి), కత్తిపూడి, కొంతంగి, అన్నవరం(రావిచెట్టు సెంటర్) పాఠశాలల్లో నాడు-నేడులో అభివ్రుద్ధిచేసిన అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఎంఈఓ వివరించారు.
సిఫార్సు