శంఖవరంలో 30 మందికి కంటివైద్య పరీక్షలు..


Ens Balu
4
Sankhavaram
2021-09-14 11:04:07

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు వైఎస్సార్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అప్తాలమిక్ ఆఫీసర్ టిడి.లలితాదేవి తెలియజేశారు. మంగళవారం శంఖవరం పీహెచ్సీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు నిర్వహించిక మెడికల్ క్యాంపులో 30 మందికి పరీక్షలు చేయగా అందులో ఇద్దరికి కేటరాక్ట్  ఆపరేషన్లు అవసరమవుతాయని గుర్తించామన్నారు. వారిని జిల్లా కేంద్రంలోని కంటి ఆసుపత్రికి తరలించనున్నట్టు ఆమె వివరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు