శంఖవరం వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తురుము మల్లీశ్వరి 14579 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ఆమెకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గెలుపొందిన నియామక పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ స్థానాన్నికూడా అలవోకగా గెలుచుకొని మండలంపై పార్టీ జెండాను రెప రెపలాడించింది. దీనితో మండంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేపు గెలుపొందిన అభ్యర్ధులంతా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అన్నీ స్థానాలు గెలుపొందడంలో నాయకుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి..