ఇది ప్రజా విజయం జెడ్పీటీసీ గిరిబాబు..
Ens Balu
3
Golugonda
2021-09-19 13:04:04
గొలుగొండ జడ్పీటీసీగా సుర్ల గిరిబాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప టిడిపీ అభ్యర్ధిపై 6917 ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నారు. గతంలోనూ గిరిబాబు జెడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ఫ తేడాతో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన గిరిబాబు తన సత్తాను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది ప్రజా విజయమన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన మండలవాసులకు రుణపడి ఉండటంతోపాటు అభివ్రుద్ధిలో కీలక భూమివ వహిస్తానని చెప్పారు.