సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..


Ens Balu
3
Annavaram
2021-09-20 08:59:11

విజయవాడకు చెందిన మాలంపాటి రామక్రిష్ణ, సీతాలక్ష్మి దంపతులు అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి నిత్య అన్నదాన ట్రస్టుకి సోమవారం దేవస్థానంలో రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఈఓ వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. అనంతరం దాతలకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తమ కుటుంబ సభ్యుల పేరుతో అన్నదానం చేయాలని దాతలు ఈఓని కోరారు. ఈ  కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సిఫార్సు