44పాఠశాలల్లో ఏకగ్రీవం..2 పాఠశాలల్లో వివాదం..
Ens Balu
4
Sankhavaram
2021-09-22 12:28:37
శంఖవరం మండలంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈఓ ఎస్వీరమణ తెలియజేశారు. బుధవారం శంఖవరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం పాఠశాలల్లో రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మధ్య విభేధాల కారణంగా అక్కడ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన పాఠశాలల్లో అంతా ప్రశాంతంగా జరిగినట్టు ఆయన వివరించారు. మిగిలిన రెండు పాఠశాలల విషయమై జిల్లా విద్యాశాఖ అధికారికి నిదేవించినట్టు ఆయనవ వివరించారు.