శంఖవరంలో 194 మందికి కోవిడ్ వేక్సిన్ పంపిణీ..


Ens Balu
3
Sankhavaram
2021-09-23 14:24:43

శంఖవరంలో గురువారం 194 మందికి కోవిడ్ వేక్సినేషన్(కోవిషీల్డ్, కోవాగ్జిన్) పంపిణీ చేసినట్టు ప్రాధమిక వైద్య ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు పీహెచ్సీ నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం శంఖవరానికి మంజూరు చేసిన 200 వేక్సిన్ లలో 194 మాత్రమే పూర్తిచేశామన్నారు. ఇంకా 6 వేక్సిన్లు మిగిలిపోయాయని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో 18ఏళ్లు నిండినవారికి, తరువాత 84రోజులు దాటిన 2వ డోసు వారికి వేక్సిన్లు అందజేసినట్టు వైద్యాధికారి తెలియజేశారు. ఇంకా వేక్సిన్ వేయించుకోని వారు ఉంటే తక్షనమే ఆయా గ్రామసచివాలయాల పరిధిలోని ఆరోగ్య సహాయకులను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

సిఫార్సు