అమ్మా మీకు పథకాలన్నీ అందుతున్నాయా..


Ens Balu
4
Sankhavaram
2021-09-28 04:56:01

అమ్మా మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా..వాలంటీర్లు మీ దగ్గరకు వస్తున్నారా..బాగోగులు చూస్తున్నారా..అంటూ శంఖవరం గ్రామసచివాలయం-2 కార్యదర్శి శంకరాచార్యులు ఆధ్వర్యంలో వాలంటీర్లు మంగళవారం ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, మండల కేంద్రంలో తమ సచివాలయ పరిధిలోని అన్ని వీధులల్లో తిరిగి ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. సచివాలయాల్లో అందించే సేవలను తెలియజేస్తున్నామన్నారు. గతంలో కంటే ఇపుడు ప్రజలకు గ్రామసచివాలయాల్లో ఎంత మంది అధికారులు, ఏఏ పనులకు ఉపయోగపడుతున్నారో గుర్తించే స్థాయికి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శితోపాటు, వాలంటీర్లు పాల్గొన్నారు.
సిఫార్సు