దోమతెరలతో జ్వారాలకు దూరంగా ఉండండి..


Ens Balu
2
వజ్రకూటం
2021-09-30 11:13:07

ప్రభుత్వం అందించే దోమ తెరలను వినియోగించి మలేరియా, డెంగ్యూ జర్వాలకు దూంగా ఉండాలని వజ్రకూటం సర్పంచ్ సకురుగుర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పంచాయతీ కార్యాలయంలో దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని చోట్ల దోమల ఉద్రుతితో జ్వరాలు పెరుగుతున్నాయన్నారు. వాటి నియంత్రణించడానికి ప్రతీ ఒక్కరూ ముందుకి వచ్చి విధిగా దోమతెరలను వినియోగించాలన్నారు. అంతేకాకుండా ఇంటి చుట్టుప్రక్కల మురుగునీరు లేకుండా, చూసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తిచెందకుండా రక్షణ చర్యలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీ గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు