శంఖవరం మండలంలో 4 కరోనా పాజిటివ్ కేసులు..


Ens Balu
1
Sankhavaram
2020-09-11 16:05:04

శంఖవరం పీహెచ్సీలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలి యజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 41 మందికి పరీక్షలు చేయగా అందులో 4(శంఖవరం-1, శ్రుంగవరం-1, గిడిజాం-1, రౌతుల పూడి-1) మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలా అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.