అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో ఈనెల 11న జరగాల్సిన హుండీ లెక్కింపు కార్యక్రమం 25వ తేదీ నాటికి వాయిదావేస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. శనివారం ఈమేరకు అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలకు హాజరవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆ ప్రకటనలో ఈఓ పేర్కొన్నారు. మార్చిన తేదీలో హుండీల లెక్కింపు జరుగుతుందన్నారు.