చిన్నారికి సీఎం రిలీఫ్ అండ్ అందజేసిన ఎమ్మెల్యే గణష్


Ens Balu
2
Narsipatnam
2020-09-12 12:46:07

గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఓచిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడిన సంఘటన పై గొలుగొండ వైఎస్సార్సీపీ నాయకులు తక్షణమే స్పందించారు. ఆ చిన్నారికి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో మండల నాయకులు, గిరిబాబు, నాయుడు తదితరులు తమ సొంత నిధులతో వైజాగ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఎమ్మెల్యే  పెట్ల ఉమ శంకర్ గణేష్ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడంతో అక్కడి నుంచి కూడా రూ.10వేలు ఆర్ధిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని చిన్నారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శనివారం తన కార్యాల యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి నిరుపేదను ఆదుకుటుందని చెప్పారు. అదే సమయంలో నాయకులు గిరిబాబు, నాయుడు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడటంతో చూపిన చొరవను అభినందించారు. ప్రతీ నాయకుడూ వారి ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా తన ద్రుష్టికి తీసుకురావచ్చొని ఎమ్మెల్యే భోరాసా ఇచ్చారు. కార్యక్రమంలో గొలుగొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.