అన్నదాన ట్రస్టుకి రూ.200116 లక్షలు విరాళం..


Ens Balu
4
Annavaram
2021-10-17 12:01:39

కర్నూలు  జిల్లా  చెందిన ఎంసీ సత్యన్నారాయణ దంపతులు  శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ. రెండు లక్షల 116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆదివారం ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు కి చెక్కురూపంలో దాతలు అందజేశారు. వైశాఖశుద్ధ ఏకాదశి రోజున తన పేరుపై  అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు