సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..


Ens Balu
2
Annavaram
2021-10-17 12:03:34

తూర్పుగోదావరి జిల్లా రామవరానికి చెందిన కర్రిసత్తిరెడ్డి కుటుంబం శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆదివారం ఏఈఓ కి చెక్కురూపంలో దాతలు అందజేశారు. కరాల సూర్రెడ్డి, వీరవెంకటలక్ష్మిల పేరుపై అక్టోబరు 19వ తేదిన అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు