వజ్రకూటం లో ప్రారంభమైన సమగ్ర భూసర్వే..
Ens Balu
4
వజ్రకూటం
2021-10-18 08:58:34
సమగ్ర భూ సర్వే ద్వారా భూహక్కుదారుడికి ప్రభుత్వం ద్వారానే అధికారిక పత్రాలు అందుతాయని తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ గుర్రాజుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ మాట్లాడుతూ, సమగ్ర భూ సర్వే వలన భూముల యొక్క స్వచ్చత బయటపడుతుందని, ప్రభుత్వ రికార్డుల్లో వున్న తప్పు ఒప్పులు కూడా సరిచేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. కార్యక్రమంలో, వీఆర్వోలు, సీతారాం, సర్వేయర్ సురేష్, మహిళా పోలీస్ కళాంజలి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.