జలవిద్యుత్ కేంద్ర కమిటీ అభివ్రుద్ధి చెందాలి..


Ens Balu
3
Rampachodavaram
2021-10-20 13:30:15

అడ్డతీగల మండలం వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం ద్వారా జలవిద్యుత్ కేంద్రం కమిటీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.  బుధవారం అడ్డతీగల మండలం వేట మామిడి మినీ జలవిద్యుత్ కేంద్రమును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పర్యటించి, సందర్శించారు. ఈ మినీ జలవిద్యుత్ కేంద్రం కమిటీ తో ప్రాజెక్ట్ అధికారి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా ఎంత కరెంటు ఉత్పత్తి అవుతున్నది ఎంత ఆదాయం వచ్చుచున్నది ఇక్కడ పనిచేసే వారికి వేతనాలు పోగా ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉన్నది  తదితర వివరాలు ప్రాజెక్టు అధికారి మినీ జలవిద్యుత్ కేంద్రం అధ్యక్షురాలు బి. సత్యవతిని ప్రాజెక్టు అధికారి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా కరెంటు ఉత్పత్తి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కమిటీ సభ్యులను ప్రాజెక్టు అధికారి కోరారు. అదేవిధంగా ఈ మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రతి ఈవెంట్ దగ్గరికి వెళ్లి ప్రాజెక్టు అధికారి పరిశీలించి ఏ ఏ పరికరాలు పనిచేస్తున్నాయి.  క్షుణ్నంగా ప్రాజెక్టు అధికారి పరిశీలించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మినీ జలవిద్యుత్ కేంద్రం కమిటీ అధ్యక్షురాలు బి.సత్యవతి, జడ్ పి టి సి ఎం.వీర్రాజు, ఎంపీపీ బి.రాఘవ, తాసిల్దార్ సి.హెచ్. శ్రీనివాసరావు, ఎంపీడీవో ఏం. బాపన్న దొర,  ఏ.ఈ.మురళీ, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు