తల్లీ పిల్లల సంరక్షణు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం పోలాకి మండలం చితవానిపేట లో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నీ త్వరలోనే కార్పోరేట్ స్థాయి ప్రీ స్కూళ్లుగా మారనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ పిరీయ విజయ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, యువ నాయకులు, జడ్పిటిసి సభ్యులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ ముద్దాడ బైరాగి దమయంతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.