నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాస్కరనాయుడు ప్రమాణ స్వీకారం..


Ens Balu
5
Narsipatnam
2021-10-28 06:36:23

నర్సీపట్నం పెదబొడ్డేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా చిటికెల భాస్కరనాయుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వకీరించారు. గురువారం ఈ మేరకు బొడ్డేపల్లా మార్కెట్ యార్డులోని కార్యాలయంలో చాంబరులో ప్రత్యేక పూజలు నిర్వహించి  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిటికెల దంపతులను అభినందించి ఘనంగా సత్కరించారు. వైస్ చైర్మన్ గా మల్లగణేష్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరందరికీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అభినందనలు తెలియజేశారు.  అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ స్థానాన్ని కట్టబెట్టిన ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. మార్కెట్ కమిటీని అభివ్రుద్ధి పధంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని అన్నారు. అంతేకాకుండా రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు మార్కెట్ కమిటీ ద్వారా అందేచూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహ మూర్తి తమరాన అప్పల్ నాయుడు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జమిల్, మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ, వీరమాచినేని జగదీశ్వరి, వైసీపీ నేతలు విజయ్ కుమార్, గుడిబండ నాగేశ్వరరావు, గణేష్ అన్న ఆర్మీ అధ్యక్షుడు తమరాన శ్రీను . గొలుగొండ, నర్సీపట్ం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాలుగు మండలాల్లోని పంచాయతీ సర్పంచ్ లు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఫార్సు