పట్టాలమ్మ ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి పూజలు..


Ens Balu
4
Kotavuratla
2021-10-28 08:12:48

కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలోని పట్టాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం, అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. పట్టాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, అమ్మవారి దయతో ఈ ప్రాంతమంతా అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎస్వీ.రమణ, డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ, నీలవేణి, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
సిఫార్సు