విశాఖలో వచ్చేనెలో4వ తేదీన జరగనున్న నేవీడీ రావాలంటూ తూర్పునావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సీఎం.వైఎస్.జగన్మోహనరెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ మాట్లాడుతూ, సీఎంని నేవి దినోత్సవానికి రావాల్సిందిగా కోరామన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అంతకు మందు సీఎంకి వైఎస్ అడ్మిరల్ తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. సీఎం వైఎస్ అడ్మిరల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.