అలెర్ట్... కోవిడ్-19 తరువాత మరణాలన్నీ హార్ట్ ఎటాక్ లే..!


Ens Balu
7
visakhapatnam
2025-06-25 07:01:30

ప్రపంచాన్ని ఒణికించిన కోవిడ్ వైరస్ కి వేక్సిన్ వేసుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలన్నీ గుండె పోటు మరణాలనే వార్త ఇపుడు మళ్లీ ప్రపంచాన్ని కలవర పెడుతున్నది. అకారణంగా మృతిచెందుతున్నవారంతా గుండెపోటు వచ్చి చనిపోతున్నవారే. ఈ వార్త ఇపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం, అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చకు తెరతీసింది. కోవిడ్-19 వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను చాలా వరకూ వినియోగించుకున్నారు. అప్పట్లో వాక్సిన్ వేసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని వైద్య నిపుణులు కూడా చెప్పుకొచ్చారు. కానీ వేక్సిన్ వేసుకున్న తరువాత చాలా మందిలో చాలా రకాల మార్పులు వచ్చాయి. దానిని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే చాలా మంది ఆరోగ్యవంతులు కూడా గుండెపోటు వచ్చి మృతిచెందుతుండటం కూడా ప్రస్తుతం అన్ని వర్గాల వారిని కలవరపెడుతున్నది.

 కొందరు ఒకటి రెండు వేక్సిన్లు వేసుకుంటే అవకాశం ఉన్నవారు మూడు నాలుగు సార్లు కూడా కోవిడ్ వేక్సిన్ వేసుకున్నారు. వేక్సిన్ వేసుకున్న తరువాత సాధారణంగా గుండ దడ పెరుగుతుందని.. వైరస్ వెళ్లిపోయిన తరువాత శరీరంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చల శారాంశం. చాలా మందికి కోవడ్ వ్యాక్సిన్ వేసుకున్న ఏడాదికి గుండె వేగం పెరిగిందని, చిన్న ఆందోళన శరీరంలోని చాలా మార్పులు వచ్చాయని కూడా చెబుతున్నారు. అవి కూడా టిబిసి(టోటల్ బాడీ చెకప్) చేయించుకున్నవారు చెబుతున్న మాట. దానికి తోడు కొందరికి గుండెపోటు వచ్చినా.. వెంటనే స్టంట్లు, బైపాస్ సర్జరీలు చేయించుకొని కాస్త ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ చాలా మందికి తెలియకుండానే ఈ గుండెపోట్లు రావడం, హఠాత్తుగా మృతిచెందుతుండటం కూడా ఆందోలన కలిగిస్తున్నది. వైరస్ ను శరీరంలోకి రానీయకుండా వ్యాక్సిన్ అయితే తయారు చేశారు చేశారు గానీ.. తరువాత దాని వలన వచ్చే దుష్ప్రభావాలు కోసం పట్టించుకోలేదని.. కనీసం మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే వాదన బలంగా వినిస్తున్నది. 

 ప్రస్తుతం కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న వేళ ప్రస్తుతం హార్ట్ ఎటాక్ మరణాలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. ఒకవేళ మళ్లీ కోవిడ్ కేసులు పెరిగి.. పరిస్థితి తీవ్రతరం అయితే మళ్లీ కోవిడ్ వైరస్ శరీరాన్ని తాకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గతంలో వేసుకున్న వేక్సిన్  వలనే శరీరంలో చాలా మార్పుల వచ్చాయని భావిస్తున్నవారు.. భయపడుతున్నవారు మళ్లీ కోవిడ్ వేక్సిన్ వేసుకునే దైర్యం చేస్తారా..? అనేది ప్రశ్నార్ధకం అయ్యింది. అటు వైద్యులు కూడా అత్యంత ఎక్కువగా జరుగుతున్న హార్ట్ ఎటాక్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 వేక్సిన్ వేసుకున్న తరువాతే హార్ట్ ఎటాక్ మరణాలు జరుగుతున్నందు.. వేక్సిన్ వలనే జరుగుతున్నాయని చెప్పడానికి లేదని.. కానీ చాలా మంది రోగులు వేక్సిన్ వేసుకున్న తరువాత శరీరంలో చాలా మార్పులు వచ్చాయని.. గుండె వేగం పెరిగిందని చెబుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు.

 కోవిడ్ వైరస్ వచ్చిన తరువాత చాలా మంది వైద్యులు కూడా గుండెపోటుతో మరణించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నది. వాస్తవానికి కోవిడ్ వైరస్ కు ఆయుర్వేదం, హోమియలోనూ మంచి కాంబినేషన్ తో మందులు ఉన్నా.. తక్షణం ఉపసమనం పొందడానికి చాలా మంది అల్లోపతి వ్యాక్సిన్ కే ప్రాధాన్యత ఇచ్చారు. వేక్సిన్ వేసుకున్న తరువాత హమ్మయ్య అనుకున్నారు తప్పితే తరువాత చాలా ఇబ్బందులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. హార్ట్ ఎటాక్ మరణాలు సంభవించిన చోట ఎక్కువగా వైరస్ కి వేక్సిన్ వేసుకున్న తరువాతనే మరణాలు పెరుగుతున్నాయనే వాదన, ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఎక్కువగా సంభవిస్తున్న హార్ట్ ఎటాక్స్ ని ముందుగా గుర్తించడానికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టి గుర్తించడం కూడా ఇపుడు చాలా అత్యవసరమైంది.