13, 14, 15తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..
Ens Balu
5
Tirumala
2021-11-06 12:37:27
తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ మేరకు టిటిడి ప్రకటన విడుదల చేసింది. నవంబరు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అందులో పేర్కొంది. అదేవిధంగా, నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలియజేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.