తిరుమలోని టిటిడి అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సోమశేఖర్ గౌడ్, శ్రీ గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ తరపున రూ 10 లక్షల వెయ్యి 16 విరాళంగా అందించారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుమల లో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు ను అందించారు. ఈ సందర్బంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వడం స్వామివారి సేవగానే భావిస్తున్నామన్నారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.