తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 29వ తేదీన వర్చువల్ విధానంలో జరుగనున్న లక్షకుంకుమార్చన సేవ కోసం ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సేవా టికెట్ ధరను రూ.1,116/-గా టిటిడి నిర్ణయించింది. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహస్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్రత్యేక ప్రవేశదర్శన క్యూలైన్లో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. దర్శన సమయంలో గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వర్చువల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.