న‌వంబ‌రు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం..


Ens Balu
3
Tiruchanur
2021-11-17 11:06:35

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జరగనుంది. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల ముందు వ‌చ్చే మంగ‌ళ‌వారం ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సిఫార్సు