విశాఖజిల్లాలో4 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సాయంత్రం విశాఖ విచ్చేసిన భారత ఉప రాష్ట్ర పతి ఎమ్. వెంకయ్య నాయుడు కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివానరావు, జెడ్ పి ఛైర్పర్సన్ జిల్లి పల్లి సుబద్ర, రియర్ అడ్మిరల్ సంజయ్ సాదు, జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున, విశాఖ సిటీ పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్.పి బి.కృష్ణారావు తదితరులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. కాగా ఆయన అక్కడి నుంచి నేరుగా పోర్టు అతిథి గ్రుహానికి పయనమయ్యారు.