ఎంపీ విజయ సాయిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ వంశీ..


Ens Balu
2
New Delhi
2021-12-02 15:30:13

రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి  వి. విజయసాయిరెడ్డిని ఎమ్మెల్సీ, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీఎంసీ పరిధిలోని పలు అంశాలపై రాజ్యసభ సభ్యులతో చర్చించారు. అంతేకాకుండా మొదటి నుంచి పార్టీ కి అహర్నిశలు కృషి చేస్తున్న పలువురికి నామినేటడ్ పదవులలో అవకాశాలు కల్పించాలని వంశీ విజయసాయిరెడ్డిని కోరారు.  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వంశీ  ప్రస్తావించారు. ఎమ్మెల్సీ గా తనకు అవకాశం కల్పించిందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో విశాఖలో పర్యటన లో ప్రజాదర్బార్, జీవీఎంసీ పరిధిలోని పలు కీలక  అంశాలపై త్వరలో  తెలియజేస్తామని ఆయనకు తెలియజేశారు.

సిఫార్సు