తిరుమలలోని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకి భల్లారికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణ రెడ్డి ఒక కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టు నుంచి నిత్యం కొన్ని వేల మందికి అన్నప్రసాదం అందుతోందని, అలాంటి ట్రస్టుకి విరాళం ఇవ్వడం శ్రీవారి సేవగా భావిస్తున్నట్టు చెప్పారు. స్వామివారి అన్నప్రసాదం మరింత మందికి అందాలనే లక్ష్యంతో తమవంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.