భారత దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించడానికి మీడియానే మార్గదర్శకంగా నిలుస్తోందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. బుదవారం న్యూఢిల్లీలోని లోక్ సభ స్పీకర్ కార్యాలయంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2022 నూతన డైరీని స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోటీపడి భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడడానికి జర్నలిస్టులు సేవలు ఎంత గానో దోహద పడుతున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి జర్నలిస్ట్ లు అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. దేశములో అన్ని రంగాల అభివృద్ధికి మీడియా తమ వంతు సేవలు సంపూర్ణంగా అందిస్తుందన్నారు. ఈ అంశంలో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.సమాజ చైతన్యం లో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది అని పేర్కొన్నారు... విశాఖ అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని అంతేకాకుండా అందమైన నగరాల్లో కూడా ముందువరుసలో ఉందన్నారు. మూడున్నర దశాబ్దాలుగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రశంసనీయమని స్పీకర్ కొనియాడారు. విశాఖ ఎంపి ఎంవీవీ సత్య నారాయణ మట్లాడుతూ జర్నలిస్ట్ లు సంక్షేమానికి వీజేఎఫ్ ఎంతగానో కృషి చేస్తుంది అన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేసిన ఘనత ఫోరమ్ కే దక్కుతుందన్నారు. కార్య క్రమం లో తొలుత స్పీకర్ ను వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి శేషవస్త్రం తో ఘనము గా సత్కరించి సింహాద్రి నాధుడు జ్ఞాపికతో సత్కరించారు. ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శి లు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావులు ఈ సందర్భముగా జర్నలిస్టులకు తమ
ప్రెస్ క్లబ్ కు సంబందించిన పలు అంశాలు తెలిపారు. విజేఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవి కుమార్, కార్య వర్గ సభ్యులు ఐరోతి ఈశ్వర రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, దొండ గిరిబాబు, నగేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.