పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి..
Ens Balu
6
Visakhapatnam
2022-02-24 04:37:27
కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ ను విశాఖ పోర్టు ట్రస్టు మాజీ సలహాదారు, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. గురువారం విశాఖలోని బీచ్ రోడ్ లోని అతిధి గృహంలో కేంద్రమంత్రికి సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేసి స్వామి గొప్పతనాన్ని శ్రీనుబాబు వివరించారు. సింహాద్రినాధుడు అత్యంత మహిమాన్వితుడని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కేంద్రమంత్రికి పలు అంశాలుతో కూడిన వినతిపత్రంను శ్రీనుబాబు అందజేశారు. విశాఖ పోర్టులో కార్మికులకు న్యాయం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. భాజాపా ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీవిశ్వనాధరాజు. పార్టీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.