శ్రీవారి ఆలయ పనులను పూర్తిచేయాలి..


Ens Balu
2
Jammu
2022-04-19 15:40:13

జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల ను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ  నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు  పనుల పురోగతిని చైర్మన్ కు  వివరించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు  అందాల్సి ఉందని,  మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్  సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

సిఫార్సు