ఇవాళ మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు. ఏప్రిల్ 30వ తేదీ రాగానే శ్రీశ్రీ పుట్టిన రోజుగా ఆయన అభిమానులు మరొక్కసారి ఆయన్ని తలుచుకుంటూ సభలు, సమావేశాలూ నిర్వహిస్తు న్నా రు గాని ఓ పాతిక ముప్ఫై ఏళ్ల కిందట శ్రీశ్రీగారు పుట్టిన రోజు విషయంలో కొంత గంద రగోళం ఉండేది. ఫలానా తేదీన పుట్టాడని కొందరూ..కాదు, ఇదే తేదీన పుట్టాడని మరి కొందరూ వా దించుకునేవారు. ఎవరికి తోచిన తేదీన వారు శ్రీశ్రీగారి పుట్టినరోజును జరుపుకునేవారు. ఈ గందరగోళానికి తెర దించుతూ, '1910 ఏప్రిల్ 30వ తేదీనాడే శ్రీశ్రీ గారు పుట్టారహో" అని మొట్టమొదట సాధికారికంగా ప్రకటించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే శ్రీశ్రీ వీరాభిమాని, విరసం నేత చలసాని ప్రసాద్. ఆ విషయం నాటి ఆంధ్రభూమి విశాఖ ఎడిషన్ లో పనిచేసి న సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు, నిర్వార్ధ విమర్శకులు మంగు రాజగోపాల్ ముఖ పుస్త కంలో తెలియజేశారు. ముఖ్య విషయం కనుక దానిని అక్షరం మార్చకుండా అలాగే అందిం చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా రాజగోపాల్ అందించిన వివరాల ప్రకారం.. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేనప్పుడు ఆంధ్రభూమి, విశాఖ ఎడిషన్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్నాను. చలసాని ప్రసాద్ మెళ్లో ఓ సంచీతో మా ఆఫీసుకి రొప్పుకుంటూ వచ్చారు. ఆయన నాకు ఏవీఎన్ కాలేజీలో చదువుకున్నప్పట్నించీ పరిచయం. ఆయన అక్కడ లెక్చరర్ గా కూడా పని చేశారు. ప్రసాద్ కుర్చీలో కూర్చుని, స్తిమితపడి సంచీలోంచి కొన్ని కాయితాలు తీస్తూ.. నీకోవిషయం చెప్పాలి అన్నారు. చెప్పండి పర్లేదు అన్నారు. చలసాని వంటి పెద్దాయన పనిగట్టుకొని కార్యాలయానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయమే వుందని నా మనసులో ఆలోచన మెదులుతోంది.
ఇంతలోనే " రాజగోపాలూ..నా శ్రమ ఫలించిందయ్యా..శ్రీశ్రీ బర్త్ డే డేటు దొరికేసింది " అంటూ ఆయన చిన్న పిల్లాడి మాదిరిగా సంబరపడిపోతూ చెప్పారు. శ్రీశ్రీ పుట్టిన తేదీ మీద సందిగ్ధత, వాదోపవాదాలకు తెర దించడానికి చలసాని ప్రసాద్ అంతకుముందే రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించిన విషయం నాకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఆ పరిశోధన కోసం రికార్డులు తవ్వి తీయించడానికి ఆయన విశాఖ మున్సిపల్ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేటట్టు ఎన్నిసార్లు తిరిగారో అది కూడా తాను గమనిస్తున్నానని వివరించారు. మొత్తానికి ఆయన కృషి ఫలించినందుకు నాకూ చాలా సంతోషం కలిగింది. చలసాని మాటల ద్వారా " శ్రీశ్రీ 1910, ఏప్రిల్ 30న పుట్టాడయ్యా! కన్ఫర్మ్ అయిపోయింది. మున్సిపల్ రికార్డుల్లో ఈ విషయం నమోదయి ఉంది. ఈ న్యూసు వెంటనే పేపర్లో వేసెయ్యాలి" అన్నాయాన. అంతే నాకు భలే ఎక్సయిటింగ్ గా అనిపించింది. మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు ఇదీ అని ప్రసాద్ లాంటి వ్యక్తి సాధికారంగా చేస్తున్న ప్రకటనను మొదటిసారిగా లోకానికి చాటి చెప్పే అదృష్టం నాకు దక్కినందుకు పొంగిపోయాను. అంతేకాదు మొత్తం విషయాన్ని వార్తలా మలచి ఆ మర్నాడే మా పేపర్ లో ఆయన పేరు మీద శ్రీ శ్రీ పుట్టిన రోజు గురించి వార్త వేశామని ద్రువీకరించారు.. దురదృష్టవశాత్తూ ఆ పేపర్ కటింగ్ ని నేను దాచుకోలేకపోయాని మదన పడ్డారు కూడా. శ్రీశ్రీ పుట్టిన రోజునాడు శ్రీశ్రీ తోపాటు చలసాని ప్రసాద్ కూడా నాకు ఎప్పటికీ గుర్తుండి పోతారని ఈ విషయం మీతో పంచుకోవాలని ఫేస్ బుక్ లో రాశానని తెలియజేశారు.
ఈ మొత్తం కధకు, రచనకు ఆధ్యులు మంగురాజగోపాల్, ఆయన ఫేస్ బుక్ పేజి నుంచి సమాచారం సేకరించి, కధనంలా మలిచి మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ పాఠకులకు అందజేస్తున్నాం. శ్రీశ్రీ వంటి కవులు, రచయతల విషయంలో రేగిన గందర గోళం చాలా మందికి చాలా రకాలుగా గుర్తిండిపోవచ్చు. అదే సమయంలో వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా సమాజం మేలు కోరే మీడియా చేపట్టాలి. ఆ బాధ్యతను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net స్వయాన బుజంపై వేసుకొని శ్రీశ్రీ పుట్టిన రోజు విషయం వెనుక దాగి వున్న నిజాన్ని మా గురు సమానులు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు, మంగు రాజగోపాల్ గారి సహకారంతో అందించాం..ధన్యవాదములు.