చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా తయారుచేసిన రూ.18.38 లక్షల విలువగల మిని లారీని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబుకు అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, అశోక్ లైలాండ్ కంపెనీ నూతన లారీని స్వామివారికి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఐ జానకిరామ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.