డాక్టర్ కంపెనీ పేర్లతో మందులు రాయకూడదు
Ens Balu
6
New Delhi
2022-05-25 07:03:10
భారత దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఎంబీబీస్, పీజీ వైద్యులు తాము హెల్త్ ప్రాక్టీస్ చేసే సమయంలోగానీ, ఆసుపత్రి విధి నిర్వహణలోగానీ రోగులకు మందుల కంపెనీల పేరుతో రాయకుడదని కేవలం మందులో ఉండే డ్రగ్ కాంబినేషన్, ఎంత డోస్ తీసుకోవాలో మాత్రమే మందుల చీటిలో రాయాలని, అదీ కూడా జనరిక్ మందులనే రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ కు చెందిన ఎథిక్స్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు అధ్యక్షులు డా.అచల్ గులాటీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రోగి మందుల చీటిలో సంబంధిత రోగానికి చెందిన డ్రగ్ ను కూడా పెద్ద అక్షరాలతో అర్దమయ్యే విధంగా రాయాలని పేర్కొంది. పైగా రోగి యొక్క వ్యాధిని కుటుంబంలోని వారికి ఉన్నది ఉన్నట్టు తెలియజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్యులు ఫార్మా కంపెనీలు ఎలాంటి బహుమతులు కూడా తీసుకోకూడదని కూడా హెచ్చరించింది. గతంలో ఒకసారి ఈ తరహా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడిలోనూ మార్పురాలేదు. ఈ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో కేంద్రం మరోసారి ఈ విషయంలో గట్టిగా స్పందించింది మళ్లీ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు తమ ప్రాక్టీసు సమయంలో ఏ విధంగా ప్రాక్టీసు చేయాలి, టెలీమెడిసిన్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా సుమా 70 పేజీల్లో సూచనలు చేసింది. అలా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో హెచ్చరించింది.