తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు
Ens Balu
1
New Delhi
2022-06-28 13:53:24
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలో ఒకటైన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై క్లారిటీ తెలుగురాష్ట్రాలకు ఇచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు వీలుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు న్యాయశాఖ సూచించింది. బిల్లు పాసైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణాలోని 119 అసెంబ్లీ స్థానాలు 153కి పెరుగుతాయి. వీటి పెరుగుదల ఆధారంగా పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికే ఈ స్థానాలు పెంచి విభజన చట్టం హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఆశావాహ ఎమ్మెల్యే అభ్యర్ధులకు లైన్ క్లియర్ అవుతుంది. అటు రాజకీయపార్టీలకు కూడా బలం పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది.