టీ ఇస్తే.. షోకాజు నోటీసు జారీ చేశారు..


Ens Balu
4
Madhya pradesh
2022-07-12 09:59:41

ఎక్కడైనా టీ ఇస్తే తిరిగి తేంక్స్ చెబుతారు.. కానీ ఒక ఉద్యోగి టీ ఇచ్చినందుకు అధికారులు ఆయనకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఖజురహో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ పర్యటన జరుగుతోంది. ఆ పర్యటనలో చల్లని టీ ఇచ్చిన ఓ ఉద్యోగి ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యటనలో సీఎంకు ఓ జూనియర్ సివిల్ సప్లైస్ అధికారి రాకేష్ కనౌహా 'టీ' అందించాడు. అది బాగోలేదని మంగళవారం అతడికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు అందజేశారు. సోమవారం ఛతర్‌పూర్ ఎయిర్‌పోర్టులో సీఎం ఆగిన సమయంలో ఇది జరిగింది. అయితే నోటీసులివ్వడంపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యమంత్రికి చల్లగా అయిపోయిన, రుచిలేని టీ ఇవ్వడం, ఆపై ఉద్యోగికి షోకాజ్ నోటీసులిచ్చిన ఘటన ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
సిఫార్సు