వాహన మిత్ర ద్వారా రూ.261.51 కోట్లు జమ
Ens Balu
3
Visakhapatnam
2022-07-15 07:02:43
భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో డ్రైవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా పథకాన్ని వారి అకౌంట్లకు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.