దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు


Ens Balu
6
New Delhi
2022-07-28 10:31:04

భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవు తున్నాయి. అటు అమెరికా, జపాన్​లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.  జపాన్​లో కొత్తగా 1.80 లక్షల మందికి కరోనా సోకగా.. అమెరికాలో 1.14 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 20,557 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కొవిడ్​ నుంచి 19,216 మంది కోలుకున్నారు. దీనితో  రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది. ఇక  ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.  కొత్తగా 8,79,504 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం కేసుల సంఖ్య 57,81,82,232కు చేరింది.  ఇప్పటివరకు వైరస్​తో 64,10,337 మంది మరణించారు.  ఒక్కరోజే 9,82,341 మంది కోలుకున్నారు.  దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,82,79,714కు చేరింది.
సిఫార్సు