గవర్నర్ ను కలిసిన నాకటక అకాడమీ మెంబర్


Ens Balu
9
Vijayawada
2022-08-01 14:49:56

కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలు  సోమవారం విజయవాడ రాజ్ భవన్ లో  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎస్పీ భారతి వాసవి కన్యకాపరమేశ్వరి చరితను దేశ నలుమూలల ప్రదర్శిస్తున్న నాట్య గురువు డాక్టర్ ఎస్పీ భారతి తాజాగా కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ  సందర్భంగా సోమవారం ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు.  ఈ సందర్భంగా ఆమె రాసిన పలు పుస్తకాలను గవర్నర్ బిస్వ భూషణ్ కు బహుకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని ఆచంట, తల్లిదండ్రులు శనగవరపు వెంకట సూర్యనారాయణ, వెంకటసుబ్బలక్ష్మి, తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి సుమారు12 ఏళ్ల పాటు చింతారామమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని  అభ్యసించారు.  90 నిమిషాల నిడివి కలిగిన వాసవి నృత్య రూపకాన్ని పలు వేదికలపై ప్రదర్శిస్తూ కూచిపూడిలో ఎంఏతో పాటు ఎంపిల్, పీహెచీ పట్టా పొందారు.  కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. సుమారు 20 అంతర్జాతీయ సెమినార్లకు హాజరవడంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత, నృత్య కళాశాలకు చీఫ్ ఎగ్జామినర్ గానూ  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల ప్రదర్శనలిచ్చారు. వందల సంఖ్యలో అవార్డులు, సత్కారాలు పొందారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ఉగాది పురస్కారంతో పాటు  2014లో తెలుగు అకాడమీ ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. "లేపాక్షి పెయింటింగ్స్ యాస్ ఏ సోర్సు ఆఫ్టూరిజం ఎట్రాక్షన్ ఇన్ ఏపీ" అనే ఆంగ్ల పుస్తకాన్ని, 'జ్యోతిర్మయం-ప్రణయ కావ్యం" అనే తెలుగు పుస్తకాన్ని రచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా నియమితులు కావడంతో పలు సాంస్కృతిక సంస్థల  ఆధ్వర్యంలో ఇటీవల  సత్కారాలు  అందుకున్నారు.
సిఫార్సు