భారత ప్రధాని నరేంద్రమోదీ మైక్రోసాఫ్ట్ కార్పొరేశన్ చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ళ తో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగాభారత్ లో సాంకేతిక విజ్ఞానం నాయకత్వ వృద్ధిలో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు మైక్కోసాఫ్ట్ వంటి టెక్నాలజీ సంస్థల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. కాగా వీరిద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అదే సమయంలో సత్యానాదెళ్లతో భేటీ కావడం ఆనందంగా వుందంటూ ప్రధాని ఆయనకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ లో పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ పెట్టనుందనే నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశం అవుతోంది.