స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్ ను శనివారం టిటిడికి విరాళంగా అందజేసిం ది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్ దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసు పత్రిలో ఈ అంబులెన్స్ ను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డిఐ జానకిరామిరెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.