గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేసే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కు ఏపీ పోలీసు శాఖ నుంచి అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న అతుల్ సింగ్ ఎంపికయ్యారు. 1995 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఈయన విశాఖపట్నం గ్రేహౌండ్స్ ఎస్పీగానూ, ఐజీపీ నార్త్ జోన్ ఇన్చార్జ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లోనూ, విశాఖలో ఇన్చార్జి పోలిస్ కమిషనర్, ఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ లో జాయింట్ సెక్రటరీగానూ, హైదబారాబాద్, సైబరాబాద్ సిటీ పోలీస్ గానూ పనిచేశారు. ఈయన ఎంపిక పట్ల పలువురు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.