కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని గురువారం అర్ధ రాత్రి వరకూ 58,379 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.73 కోట్లు వచ్చింది. ఇంకా రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.