కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ద్వీపాలకు పేర్లు పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పేరును కేంద్ర ప్రభుత్వం శనివారం 'అమృత్ ఉద్యాన్'గా మార్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్' థీమ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.