కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని జడ్కల్, ముదురు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. ఒక రకంగా దారుణం, మరో రకంగా వినూత్నంగా అక్కడి ప్రజలు మరణించిన వారి పార్ధీవ శరీరాలను దహనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పండింది. శ్మశానం నిర్మించాలని దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ను అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో వ్యవసాయ సహకారం సంఘం సాయంతో ఆ గ్రామస్థులు ఓ సంచార శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా చనిపోతే వారి ఇంటి వద్దకే వచ్చి దహన సంస్కారాలు చేసిన తరువాత కుటుంబీకులకు చితాభస్మాన్ని ఇచ్చి వెళతారు. ఈ మిషీన్ గ్యాస్, విద్యుత్తో పనిచేస్తుంది.